నైజాం ఏరియాలో ముఖ్యమైన మైలు రాయి చేరుకున్న రచ్చ

నైజాం ఏరియాలో ముఖ్యమైన మైలు రాయి చేరుకున్న రచ్చ

Published on Apr 23, 2012 8:27 AM IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ‘రచ్చ’ సినిమా ఇటీవలే విడుదలై మంచి కలెక్షన్లతో దూసుకుపోతుండగా, ఈ చిత్రం నైజాం ఏరియాలో ఒక ముఖ్యమైన మైలు రాయి చేరుకుంది. 23వ తేదీ రెండవ ఆట ముగియడంతో నైజాం అరుయకు గాను 10 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. విడుదలైన మొదటి రోజు నుండే హిట్ టాక్ తో అన్ని ఏరియల్లోను మెగా కలెక్షన్లు వసూలు చేస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. మరీ ముఖ్యంగా ఈ చిత్రం బి మరియు సి సెంటర్లలో ఉండే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్, చరిష్మాకి తమన్నా అందాలు తోడవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద రచ్చ సినిమా రచ్చ రచ్చ చేస్తుంది. మని శర్మ సంగెతం అందించిన ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకుడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఎన్.వి ప్రసాద్ మరియు పారస్ జైన కలిసి సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు