‘రాజు గాడు’ లో హైలైట్ అవ్వనున్నరాజ్ తరుణ్ పాత్ర !

‘రాజు గాడు’ లో హైలైట్ అవ్వనున్నరాజ్ తరుణ్ పాత్ర !

Published on May 25, 2018 2:59 AM IST

రాజ్ తరుణ్ ,అమైరా దస్తూర్ జంటగా కొత్త దర్శకురాలు సంజనా రెడ్డి తెరకెక్కించిన చిత్రం రాజు గాడు. ఈసినిమా నిర్మాంతర కార్యక్రమాలు ముగించుకొని జూన్ 1న విడుదలకు సిద్ధంగా ఉంది. రాజ్ తరుణ్ ఈ సినిమాలో ఒక వింత వ్యాధితో బాధపడుతుంటాడు . తనకు తెలియకుండానే దొంగతనం చేసేస్తుంటాడు ఇలాంటి వింత వ్యాధి వల్ల హీరో ఎలాంటి బాధలు పడ్డాడు అన్నది కథ. దొంగతనం సమయంలో వచ్చే సన్నివేశాలు హిలేరియస్ గా ఉండనున్నాయి.

రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాని ఏ కె ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. ఇంతకు ముందు ఈ జోనర్ లో వచ్చిన భలే భలే మగాడివోయ్ , మహానుభావుడు సినిమాలు విజయం సాధించాయి .మరి రాజుగాడు రాజ్ తరుణ్ కి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు