భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం ‘మహేష్’ సిద్ధం !

భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం ‘మహేష్’ సిద్ధం !

Published on Apr 20, 2025 9:00 AM IST

దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు సినిమాను హాలీవుడ్ స్థాయిలో నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తోంది.
ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం మహేశ్, ప్రియాంక, పృథ్వీరాజ్‌తో పాటు దాదాపు 3వేల మంది జూనియర్‌ ఆర్టిస్ట్‌లు పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. మే నుంచి జూన్‌ వరకు ఈ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నారట. దీనికోసం ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. అన్నట్టు ప్రముఖ హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్స్‌ నేతృత్వంలో ఈ పోరాట ఘట్టాన్ని తెరకెక్కించనున్నారు.

ఏదిఏమైనా పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఆ మధ్య విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాశాను’ అంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి రాజమౌళి – మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఉండబోతుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. విజయేంద్రప్రసాద్‌ కథ, దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు