సీనియర్ హీరో డా రాజశేఖర్, యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం 1983 నేపథ్యంలో సాగుతుందని కథ కూడా రొటీన్ కి భిన్నంగా ఉండబోతుందని తెలుస్తోంది. గరుడవేగ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత రాజశేఖర్ నటిస్తుండటం, మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
కాగా ఇటీవలే లాంచ్ అయిన ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను శరవేగంగా జరుపుకుంటుంది. త్వరలోనే రెగ్యులర్ షూట్ మొదలుపెట్టడానికి చిత్రబృందం సన్నాహాలు చేసుకుంటుంది. మరి గరుడవేగ చిత్రం లాగే ఈ చిత్రం కూడా రాజశేఖర్ కి భారీ హిట్ ఇస్తుందేమో చూడాలి.