‘2.0’ చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా – రజినీకాంత్

‘2.0’ చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా – రజినీకాంత్

Published on Nov 26, 2018 7:58 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, అక్షయ్ కుమార్ విలన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ నెల 29న రాబోతున్న భారీ చిత్రం ‘2.o’. కాగా తాజాగా ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని పార్క్ హైయేత్ లో ఘనంగా జరిగింది.

కాగా ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్ మాట్లాడుతూ.. ఈ ‘2.0’ చిత్రం కోసం ప్రేక్షకులు లాగే తానూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానన్నారు. ఎందుకంటే సినిమాలో 45 శాతం గ్రాఫిక్స్ ఉంటుంది. అందుకే మాక్కూడా సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎంతో ఆసక్తిగా ఉంది. ఇక ఈ సినిమాలో అద్భుతమైన కథ కూడా ఉంది. ఎలాంటి హంగు ఆర్భాటాలు ఉన్న సినిమానైనా, నడిపించేది ఆ కథ. అలాంటి కథ ఉన్న సినిమా ఈ ‘2.0’. అందుకే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. అన్నారు.

ఇంకా రజనీ మాట్లాడుతూ.. ‘శంకర్ చెప్పినట్టు ఈ సినిమాను త్రీడీలో చూస్తే కొత్త అనుభూతిని పొందుతాం. అందరూ త్రీడీలోనే చూడండి. ఇక ఈ సినిమాకు ప్రమోషన్ అవసరం లేదు. కానీ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోన్న ప్రసాద్ గారు (నవ్వుతూ) అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. అని సరదాగా అన్నారు. అలాగే సూపర్ స్టార్ దర్శకుడు శంకర్ పై మరియు ఇతర తారాగణం పై ప్రశంసల వర్షం కురిపించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు