రకుల్ కు షాక్ ఇచ్చిన వెంకీమామ టీం ?

రకుల్ కు షాక్ ఇచ్చిన వెంకీమామ టీం ?

Published on Feb 21, 2019 11:21 AM IST

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య ల మల్టీ స్టారర్ వెంకీమామ షూటింగ్ రాజమండ్రి లో ప్రారంభమైంది. ఇక ఈ చిత్రంలో చైతు సరసన రకుల్ ప్రీత్ సింగ్ ను ఫైనల్ చేశారని ఎప్పటినుండో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా రకుల్ ప్లేస్ లో ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నాబా నటేష్ ను తీసుకున్నారని సమాచారం. మరి రకుల్ ను తప్పించడానికి గల కారణాలు తెలియాల్సి వుంది.

బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వెంకీ కి జోడిగా ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ను తీసుకున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కోన ఫిలిం కార్పొరేషన్ , సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు