రాజమౌళి మల్టీస్టారర్ నుంచి లేటెస్ట్ అప్ డేట్ !

రాజమౌళి మల్టీస్టారర్ నుంచి లేటెస్ట్ అప్ డేట్ !

Published on Oct 6, 2018 9:22 AM IST

ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి రాజమౌళి ఓ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం రాజమౌళి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలిసి నవంబర్ నుండి ఈ చిత్ర వర్క్ షాప్ లో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది.

కాగా ఈ ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర కథ బ్రిటీష్ కాలం నేపథ్యంలో జరగుతుందట. రామోజీ ఫిల్మ్ సిటీలో మరియు అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్మించిన భారీ సెట్ల నిర్మాణాలు అన్ని బ్రిటీష్‌ నేపధ్యానికి, అప్పటి వాతావరణానికి సంబంధించినవేనని సమాచారం. ఆ సెట్స్ లో వాడే ప్రాపర్టీస్ కూడా అన్ని ఆ కాలం నాటివే నని తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్ర షూటింగ్ లో మొదటగా ఎన్టీఆర్ పాల్గొంటాడు. ఎన్టీఆర్ పై కొంత భాగం చిత్రీకరించిన తర్వాత రామ్ చరణ్ షూట్ లో జాయిన్ అవుతాడు. ఇప్పటికే ఈ చిత్ర స్క్రిప్ట్ కూడా ఒక డ్రాఫ్ట్ పూర్తయింది. ప్రస్తుతం ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు