ఇస్మార్ట్ శంకర్ విజయవంతం అయిన రామ్, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తన కొత్త చిత్రం రెడ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా చేస్తోన్న తాజా సినిమా ‘రొమాంటిక్’. కాగా నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. పూరి నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరో రామ్ అతిథి పాత్ర పోషించాడని తెలుస్తోంది. ఇప్పటికే గోవాలో రామ్ కనిపించే సీన్ ను కూడా చిత్రీకరించారట.
ఇక ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఆకాశ్ పూరి సరసన కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కనుందట. మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందేమో చూడాలి. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాల పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.