భిన్నంగా రానున్న ‘గ్యాంగ్‌స్టర్’ !

భిన్నంగా రానున్న ‘గ్యాంగ్‌స్టర్’ !

Published on Aug 7, 2019 12:12 PM IST

హీరో శర్వానంద్ – సుధీర్ వర్మ కాంబినేషన్ లో ‘రణరంగం’ సినిమా ఆగష్టు 15వ తేదీన విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమాకి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. కాగా ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్స్‌లో విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమా అన్ని వర్గాలవారిని అలరిస్తుందట. ముఖ్యంగా ‘గ్యాంగ్‌స్టర్’గా ఈ చిత్రంలో శర్వానంద్ పాత్ర శర్వా గత చిత్రాలకు భిన్నంగా ఉండటమే కాకుండా, ఎంతో వైవిధ్యంగానూ, ఎమోషన్స్‌తో కూడినదై ఉంటుందట.

‘గ్యాంగ్ స్టర్’ అయిన చిత్ర కథానాయకుని జీవితంలో 1990 మరియు ప్రస్తుత కాలంలోని సంఘటనల సమాహారమే ఈ ‘రణరంగం’. భిన్నమైన భావోద్వేగాలు, కథ, కథనాలు ఈ చిత్రం సొంతం. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్‌ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: అర్జున్ – కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఎడిటర్: నవీన్ నూలి, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ

సంబంధిత సమాచారం

తాజా వార్తలు