వాయిదాపడిన మాస్ రాజా కొత్త చిత్రం టైటిల్ లోగో లాంచ్ !

వాయిదాపడిన మాస్ రాజా కొత్త చిత్రం టైటిల్ లోగో లాంచ్ !

Published on Nov 10, 2018 3:30 PM IST


వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ నటించనున్న కొత్త చిత్రం యొక్క టైటిల్ లోగో పోస్టర్ ను నవంబర్ 13న లాంచ్ చేయనున్నారని తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఈవెంట్ ను వాయిదా వేశారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ ఆంటొని’ చిత్రం ఈనెల 16న విడుదలవుతుంది. దాంతో రవితేజ ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీ గా వున్నాడు. అందుకని ఈ చిత్ర టైటిల్ లోగో ను అమర్ అక్బర్ విడుదల తరువాత లాంచ్ చేయనున్నట్లుగా ప్రకటించింది చిత్ర నిర్మాణ సంస్థ ఎస్ ఆర్ టీ ఎంటర్టైన్మెంట్స్.

తమన్ సంగీతం అందించనున్న ఈ చిత్రంలో నాబా నటేష్ , పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటించనున్నారు. మరో హీరోయిన్ ను ప్రకటించాల్సి వుంది. డిసెంబర్ నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు