వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ నటించనున్న కొత్త చిత్రం యొక్క టైటిల్ లోగో పోస్టర్ ను నవంబర్ 13న లాంచ్ చేయనున్నారని తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఈవెంట్ ను వాయిదా వేశారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ ఆంటొని’ చిత్రం ఈనెల 16న విడుదలవుతుంది. దాంతో రవితేజ ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీ గా వున్నాడు. అందుకని ఈ చిత్ర టైటిల్ లోగో ను అమర్ అక్బర్ విడుదల తరువాత లాంచ్ చేయనున్నట్లుగా ప్రకటించింది చిత్ర నిర్మాణ సంస్థ ఎస్ ఆర్ టీ ఎంటర్టైన్మెంట్స్.
తమన్ సంగీతం అందించనున్న ఈ చిత్రంలో నాబా నటేష్ , పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటించనున్నారు. మరో హీరోయిన్ ను ప్రకటించాల్సి వుంది. డిసెంబర్ నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.
As our Mass Maharaj @RaviTeja_offl is busy with #AAA promotions, Which is releasing on Nov 16th, the Title logo launch of our upcoming film with Ravi Teja garu & @directorvianand will be launched after the release of #AAA. All the best for #AAA. Stay tuned for updates.
— SRT Entertainments (@SRTmovies) November 10, 2018