‘2.0’ నైజాం , కర్ణాటక కలక్షన్స్ !

‘2.0’ నైజాం , కర్ణాటక కలక్షన్స్ !

Published on Nov 30, 2018 10:44 AM IST


క్రియేటివ్ డైరక్టర్ శంకర్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘2.0’ నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్ తో బాక్సాఫిస్ వద్ద కొత్త రికార్డులను సృష్టిస్తుంది. ఇక ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. నిన్న వర్కింగ్ డే అయినా కూడా నైజాం లో ఈ చిత్రం మొదటి రోజు రూ.4.73 కోట్ల షేర్ ను రాబట్టింది.

ఇక కర్ణాటక లో ఈచిత్రం మొదటి రోజు రూ.8.25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి అక్కడ రజినీ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్ ను సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఇదీలావుంటే భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రం కావడం తో ఈ వారాంతం ఈచిత్రానికి చాలా కీలకం కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు