“RRR” ట్రైలర్ ఎఫెక్ట్..థియేటర్స్ కి సెక్యూరిటీ కావాలని లెటర్ వైరల్.!

“RRR” ట్రైలర్ ఎఫెక్ట్..థియేటర్స్ కి సెక్యూరిటీ కావాలని లెటర్ వైరల్.!

Published on Dec 8, 2021 10:00 AM IST

ఇప్పుడు పాన్ ఇండియన్ వైడ్ ప్రేక్షకులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం” నుంచి ట్రైలర్ ని రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ భారీ ప్లానింగ్ లు వేసిన సంగతి తెలిసిందే. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో ఈ సినిమా ట్రైలర్ ని ప్రదర్శితం చెయ్యడానికి థియేటర్స్ రేపటికి రెడీ అవుతున్నాయి.

అయితే ఈ సమయంలో తమ థియేటర్స్ కి సెక్యూరిటీ కావాలి అంటూ వైజాగ్ కి చెందిన ప్రముఖ థియేటర్స్ సంగం, శరత్ యాజమాన్యం పోలీసులని ఆశ్రయించడం వైరల్ గా మారింది. రేపు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల సమయంలో మా ట్విన్ థియేటర్స్ కి ప్రొటెక్షన్ కావాలని ఆ సమయంలో పెద్ద ఎత్తున అభిమానులు వచ్చే అవకాశం ఉందని..

అందుకే విశాఖ ఏసీపీకి బందోబస్త్ నిమిత్తం లెటర్ పంపారు. దీనితో ఇది కాస్తా ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే గతంలో ఇదే థియేటర్స్ లో పవన్ నటించిన “వకీల్ సాబ్” ట్రైలర్ ని ప్రదర్శితం చేసినపుడు పెద్ద ఎత్తున అభిమానులు రావడం మూలాన ఆ ధాటికి అద్దాలు కూడా పగిలిపోయాయి అందుకే ఇపుడు ఈ భారీ సినిమా ట్రైలర్ కి పరిస్థితి ఎలా ఉంటుందో అని ముందు జాగ్రత్త పడుతున్నారు కావచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు