‘సాహో’ నుండి లేటెస్ట్ అప్ డేట్ !

‘సాహో’ నుండి లేటెస్ట్ అప్ డేట్ !

Published on May 9, 2019 10:00 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న భారీ చిత్రం ‘సాహో’. కొన్నిరోజుల క్రితం ముంబైలో కీలక షెడ్యూల్ ను పుర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ముంబై లో తీసిన ప్రభాస్ యాక్షన్ సీన్స్ హాలీవుడ్ స్థాయిలో ఉంటాయట. ఇక సాహో చిత్రబృందం ఈ నెల మూడో వారంలో యూరప్ వెళ్లనుందట. శ్రద్ధా కపూర్ -ప్రభాస్ ఇద్దరి మీద ఒక రొమాంటిక్ సాంగ్ ను అక్కడ షూట్ చేస్తారట. ఆగష్టు 15న విడుదల కానున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది.

కాగా ఇటివలే సాహో నుండి ఒక ఫోటో లీకయింది. ఆ ఫోటోలో శ్రద్ధా కపూర్ – ప్రభాస్ ఇద్దరూ ఒకరికళ్ళలోకి ఒకరు మంచి రొమాంటిక్ మూడ్ లో చూసుకుంటూ కనిపించారు. ఆ ఒక్క ఫోటోకే ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మరి రొమాంటిక్ సీన్స్ లో ఈ జంట ఇంకెలా ఆకట్టుకుంటారో చూడాలి. ఈ చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘యు.వి క్రియేషన్స్’ ఈ సినిమాను నిర్మస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు