వాయిదాపడిన ‘సాక్ష్యం’ విడుదల !

వాయిదాపడిన ‘సాక్ష్యం’ విడుదల !

Published on May 26, 2018 10:35 AM IST

యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్న తాజా చిత్రం ‘సాక్ష్యం’. శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పంచభూతాలు అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్ట్రర్లు, టీజర్ బాగుండటంతో సినిమా ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ముందుగా ఈ చిత్రాన్ని జూన్ 14న విడుదలచేయాలని నిర్మాతలు భావించారు.

కానీ ఇప్పుడు చిత్రాన్ని జూలై నెలకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వాయిదా వెనకున్న కారణాలేమిటనేది తెలియరాలేదు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు నిర్మాతలు. మంచి బడ్జెట్ తో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోంది. ఆర్థర్ ఏ విల్సన్, పీటర్ హెయిన్స్ వంటి ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు