హీరో ఆది పినిశెట్టి నటించిన లేటెస్ట్ మూవీ ‘శబ్దం’ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాను దర్శకుడు అరివళగన్ వెంకటాచలం డైరెక్ట్ చేయగా పూర్తి థ్రిల్లర్ మూవీగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో ఈ మూవీపై మంచి బజ్ని క్రియేట్ చేశాయి.
అయితే, ఈ సినిమాను తమిళ్తో పాటు తెలుగులోనూ గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. తెలుగులో ప్రీమియర్ షోస్తోనే ఈ సినిమా సందడి మొదలైంది. కానీ, తమిళ్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయలేకపోయారు మేకర్స్. దానికి కొన్ని టెక్నికల్ కారణాలే సమస్యగా నిలిచాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక శుక్రవారం రాత్రి షోలకు ఎలాగైనా సినిమాను రిలీజ్ చేస్తామని వారు తెలిపారు.
థమన్ అందించిన బీజీఎం హైలైట్గా నిలిచిన ఈ సినిమా మరి తమిళనాట నిశ్శబ్దం ఎప్పుడు వీడుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో లక్ష్మీ మీనన్, సిమ్రాన్, లైలా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
Dear all,
We are doing our best to bring #SABDHAM (Tamil) to theaters for the night show Today!
We sincerely apologize for the inconvenience caused and truly regret the situation. Thank you for your patience and support.
Love you all????❤️— Aadhi???? (@AadhiOfficial) February 28, 2025