‘చిత్రలహరి’నుంచి లేటెస్ట్ అప్ డేట్ !

‘చిత్రలహరి’నుంచి లేటెస్ట్ అప్ డేట్ !

Published on Oct 17, 2018 5:18 PM IST


మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ‘నేను శైలజ’ ఫెమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి’ అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన ‘హలో’ ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటిస్తోంది.

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 2 నుండి ప్రారంభమవుతుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను సక్సెస్‌ఫుల్‌ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై రూపొందించనున్నారు. ప్రముఖ హాస్య నటుడు కమ్ హీరో సునీల్ ఒక ముఖ్య పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు