పాన్ ఇండియా ఎంట్రీతో సాయి ధరమ్ తేజ్ క్లిక్కవ్వనున్నాడా.!

పాన్ ఇండియా ఎంట్రీతో సాయి ధరమ్ తేజ్ క్లిక్కవ్వనున్నాడా.!

Published on Dec 7, 2022 7:39 PM IST

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో కంటెంట్ ఉంటే ఇతర భాషల్లో ఆ హీరో కాస్త కొత్త అయినా కూడా మంచి ఆదరణ అందుకుంటాయని నిరూపించిన చిత్రాలు ఈ ఒక్క ఏడాది లోనే చాలా ఉన్నాయి. ఇక అలాగే మన టాలీవుడ్ నుంచి సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా తన పాన్ ఇండియా ఎంట్రీ కి రెడీ అయ్యాడు. యువ దర్శకుడు కార్తీక్ దండు తో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ థ్రిల్లర్ చిత్రం “విరూపాక్ష” ని ఈరోజు మేకర్స్ రెవెల్క్ చేశారు.

మరి ఈ రివీల్ చేయడంతోనే సాయి తేజ్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమాగా దీనిని ప్రకటించారు. అయితే ఈ గ్లింప్స్ మంచి ఆసక్తికరంగానే పాన్ ఇండియా ఆడియెన్స్ అటెన్షన్ ని అందుకునే లానే ఉంది. మరి దీనితో అయితే సాయి తేజ్ కూడా క్లిక్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని అయితే మేకర్స్ పాన్ ఇండియా లెవెల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 21న 2023 లో తీసుకురానున్నట్టుగా అనౌన్స్ చేసేసారు. మరి తేజ్ పాన్ ఇండియా ఎంట్రీ ఎలా ఉండనుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు