హుదూద్ తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ముందుంది. ఇప్పటికే ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్స్, దర్శకులు, నిర్మాతలు తమ వంతుగా విరాళాలను అందించారు. వీరి లిస్టులో తాజాగా ‘ఈగ’ చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి వచ్చి చేరారు.
సాయి కొర్రపాటి అందరిలా ఆర్ధికంగా సహాయం చేయకుండా.. అక్కడ తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతూ విపత్కర పరిస్థితుల్లో ఉన్న వారికి భోజనం అందించాలనే ఉద్దేశంతో బియ్యం కొని పంపారు. సాయి కొర్రపాటి అప్పటికప్పుడు నెల్లూరులో 100 టన్నుల భియ్యం ని కొనుగోలు చేసారు. దాన్ని 20 కేజీల బ్యాగుల్లో నింపి మొత్తం 50 వేల బస్తాలను వైజాగ్ కి పంపారు.
‘ఇది కేవలం మొదటి విడతే అని మలి విడతలో కూడా పలువురికి సహాయం అందించేలా చూస్తాను అన్నారు. అంతే కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలకి ఏమి అవసరం ఉన్నా ఆ అవసరాన్ని తీర్చడానికి ముందు వరుసలో ఉంటానని’ సాయి కొర్రపాటి హామీ ఇచ్చారు. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో సాయి కొర్రపాటి తీసుకున్న నిర్ణయం అబినందించదగినది పలువురు అభిప్రాయపడుతున్నారు.
బాధితుల కోసం 50వేల బియ్యం బస్తాలు పంపిన సాయి కొర్రపాటి
బాధితుల కోసం 50వేల బియ్యం బస్తాలు పంపిన సాయి కొర్రపాటి
Published on Oct 15, 2014 7:00 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ప్రకటన : 123తెలుగు.కామ్ కోసం తెలుగు కంటెంట్ రైటర్స్ కావలెను
- వీడియో: మిరాయ్ – ది బ్లాక్ స్వోర్డ్ గ్లింప్స్ (తేజ సజ్జా, మంచు మనోజ్)
- విశ్వంభర కోసం భారీ యాక్షన్ సెట్
- క్రేజీ: పవన్, తారక్ ల భారీ క్లాష్ పడబోతుందా!?
- థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలరిస్తున్న “గం గం గణేశా” ట్రైలర్!
- ఓటిటి: నెవెర్ బిఫోర్ నెంబర్ భాషల్లో సూర్య “కంగువ”?
- పోల్ : ఈ చిత్రాల్లోని ఏ మొదటి పాట మిమ్మల్ని బాగా ఆకట్టుకుంది ?
- “ఓజి” రిలీజ్ పరిస్థితి ఏంటి?