రాజమౌళి సినిమాకి డైలాగ్స్ రాస్తున్న స్టార్ రైటర్ !

రాజమౌళి సినిమాకి డైలాగ్స్ రాస్తున్న స్టార్ రైటర్ !

Published on Oct 14, 2018 7:20 PM IST

ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి రాజమౌళి ఓ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ‘బాహుబలి’ తరవాత ఆయన చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం కోసం ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా పని చేస్తున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం సాయిమాధవ్ ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ డైలాగ్స్ ని ఇప్పటికే పూర్తి చేసారని తెలుస్తోంది.

కాగా ఈ ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర కథ బ్రిటీష్ కాలం నేపథ్యంలో జరగనుందట . రామోజీ ఫిల్మ్ సిటీలో మరియు అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్మించిన భారీ సెట్ల నిర్మాణాలు అన్ని బ్రిటీష్‌ నేపధ్యానికి, అప్పటి వాతావరణానికి సంబంధించినవే కావటం.. పైగా ఆ సెట్స్ లో వాడే ప్రాపర్టీస్ కూడా అన్ని ఆ కాలం నాటివే కావడం ఆ వార్తలకు బలం చేకూరుస్తోంది. ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్ర షూటింగ్ లో మొదటగా ఎన్టీఆర్ పాల్గొంటాడు. ఎన్టీఆర్ పై కొంత భాగం చిత్రీకరించిన తర్వాత రామ్ చరణ్ షూట్ లో జాయిన్ అవుతాడట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు