షూటింగ్ పూర్తి చేసుకున్న సంపత్ నంది చిత్రం !

షూటింగ్ పూర్తి చేసుకున్న సంపత్ నంది చిత్రం !

Published on Jun 19, 2018 6:48 PM IST

దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ‘గాలిపటం’ చిత్రాన్ని నిర్మించిన ఆయన ఈసారి ‘పేపర్ బాయ్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడ మొదలుపెట్టుకుంది. ఇందులో సంతోష్ శోభన్, ప్రియా శ్రీ, తాన్యా హోప్ లు ప్రధాన పాత్రలు చేస్తున్నారు.

ఈ చిత్రం ఒక రొమాంటిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలుస్తోంది. సినిమాలో సహజత్వం కోసం పూణే, ముంబై, హైదరాబాద్, కేరళ, గోవా వంటి ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ను రేపు 20వ తేదీన సంపత్ నంది పుట్టినరోజు కానుకగా విడుదల చేస్తున్నారు.

నూతన దర్శకుడు జయశంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించారు. జూలైలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు