మళ్ళీ గడ్డు కాలం ఎదుర్కుంటున్న స్టార్ డైరెక్టర్ !

మళ్ళీ గడ్డు కాలం ఎదుర్కుంటున్న స్టార్ డైరెక్టర్ !

Published on Jun 21, 2018 9:10 PM IST

తెలుగు చిత్రపరిశ్రమలోకి డైలాగ్ రైటర్ గా ఎంటరై, తర్వాత వరుణ్ సందేశ్ హీరోగా ‘ఏమైందీ వేళ’ అనే చిత్రాన్ని తెరకెక్కించి దర్శకుడిగా మారాడు సంపత్ నంది. ఆ చిత్రం విజయం సాధించడంతో ఏకంగా మెగా పవర్ స్టార్ తోనే సంపత్ కి సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. దాంతో రచ్చ అనే కమర్షియల్ ఎంటర్ టైనర్ తెరకెక్కించి మంచి హిట్ కొట్టాడు. రచ్చ చిత్రాన్ని చూసిన పవర్ స్టార్ తనతోనూ ఓ సినిమా చేయమని గోల్డెన్ ఛాన్స్ ఇవ్వడంతో సంపత్ నంది స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లోకి చేరిపోయాడు. ఆ ఉత్సాహంతోనే ప్రొడ్యుసర్ గా మారి ఆదితో గాలిపటం అనే చిత్రాన్ని కూడా నిర్మించాడు. కానీ గాలిపటం పరాజయం పాలవ్వటం, కొన్ని కారణాల వల్ల పవన్ కళ్యాణ్ సినిమా నుంచి సంపత్ నంది తప్పుకోవాల్సి రావటంతో ఇక సంపత్ నంది పని అయిపోయిందనుకున్నారంతా..!

కరెక్ట్ గా ఆ టైంలోనే రవితేజతో తీసిన బెంగాల్ టైగర్ చిత్రం భారీ విజయం సాధించకపోయినప్పటికీ కమర్షియల్ గా వర్కౌట్ అవ్వటంతో సంపత్ మళ్ళీ హిట్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. కానీ ఆ తర్వాత గోపిచంద్ తో తీసిన ‘గౌతమ్ నంద’ చిత్రం భారీ అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్ అవ్వటంతో సంపత్ మళ్లీ ప్లాప్ డైరెక్టర్ల జాబితాలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు స్టార్ హీరోల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఒక భారీ హిట్ తో తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే గాని ఆయనకు స్టార్ హీరోలు ఎవ్వరూ అందుబాటులోకి రారు. ప్రస్తుతం ఆయన తన మిత్రులతో కలిసి ‘పేపర్ బాయ్’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు