ఆగష్టులో ‘సావిత్రి w/o సత్యమూర్తి’..!

ఆగష్టులో ‘సావిత్రి w/o సత్యమూర్తి’..!

Published on Jul 10, 2021 9:42 PM IST

అరవైయేళ్ల మహిళకు పాతికేళ్ల కుర్రాడు ఎలా భర్త అయ్యాడు? ఎందుకు వారు పెళ్లి చేసుకున్నారు? ఎలా కలిసి ఉన్నారు? అనే కథాంశంతో తెరకెక్కిన వినోదాత్మక కుటుంబకథా చిత్రం ‘సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి’. కేరింత’ ఫేమ్ పార్వతీశం పాతికేళ్ల కుర్రాడిగా, హాస్యనటి శ్రీలక్ష్మి అరవైయేళ్ల మహిళగా ఇందులో నటిస్తున్నారు. ఏ1 మహేంద్ర క్రియేషన్స్ పతాకంపై గోగుల నరేంద్ర నిర్మిస్తున్న ఈ సినిమాతో పూరి జగన్నాథ్ దగ్గర పని చేసిన చైతన్య కొండ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అయితే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఆగస్టు మూడో వారంలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.

ఈ సందర్భంగా నిర్మాత గోగుల నరేంద్ర మాట్లాడుతూ కుటుంబం అంతా కలిసి చూసే సినిమా ఇదని, పార్వతీశం, శ్రీలక్ష్మిగారి జంట నవ్వులు పూయిస్తుందని అన్నారు. ఈ సినిమాతో ముగ్గురు కొత్త కథానాయికలను పరిచయం చేస్తున్నామని, త్వరలో వాళ్లను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఆగష్టు మూడో వారంలో సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు