ప్రమోషన్స్ మొదలుపెట్టిన ‘సవ్యసాచి’ !

ప్రమోషన్స్ మొదలుపెట్టిన ‘సవ్యసాచి’ !

Published on Oct 18, 2018 11:04 PM IST

చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా, నిధి అగర్వాల్ కథానాయకిగా తెరకెక్కుతున్న చిత్రం ‘సవ్యసాచి’. ఈ చిత్రంలో తమిళ నటుడు ఆర్.మాధవన్, మాజీ హీరోయిన్ భూమిక కూడా కీలకపాత్రల్లో నటిస్తుండటం విశేషం. కాగా ప్రస్తుతం విడుదల సమయం దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ఈ రోజు నుంచి ప్రమోషన్స్ ను స్టార్ట్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో కూడా మంచి బజ్ క్రియేట్ అయింది.

వెన్నెల కిషోర్, సత్య, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. బాహుబలి చిత్రానికి గ్రాఫిక్స్ ను అందించిన మకుట సంస్థనే ఈ చిత్రానికి కూడా గ్రాఫిక్స్ ను అందిస్తోంది. ప్రేమమ్ తరువాత చైతు, చందూ మొండేటిల కలయికలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నవంబర్ 2న భారీ స్థాయిలో రిలీజ్ అవ్వనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు