ఆ పెద్ద హీరో ప్రాజెక్ట్ శర్వానంద్ చేతికి వెళ్లిందా ?

ఆ పెద్ద హీరో ప్రాజెక్ట్ శర్వానంద్ చేతికి వెళ్లిందా ?

Published on Sep 29, 2020 11:06 PM IST


ఇండస్ట్రీలో ఒక హీరోతో అనుకున్న కథ ఇంకో హీరోతో తెరకెక్కడం అనేది సర్వసాధారణం. అన్నీ బాగుంటే దర్శకుడు ముందుగా ఏ హీరోతో సినిమా అనుకున్నాడో ఆ హీరోతోనే కానిచ్చేస్తాడు. ఒకవేళ అనుకున్నది జరగకపోతే అదే కథను ఇంకో హీరోతో చేసేస్తుంటారు. అలా ఒక సీనియర్ స్టార్ హీరో చేయవలసిన ప్రాజెక్ట్ శర్వానంద్ వద్దకు వెళ్ళిందట. ఆ పెద్ద హీరో ఎవరో కాదు విక్టరీ వెంకటేష్. వెంకటేష్ హీరోగా డైరెక్టర్ కిశోర్ తిరుమల ఛాన్నాళ్ల క్రితం ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ అనుకున్నారు. చర్చలు కూడ ముగిశాయి. చిత్రానికి ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే టైటిల్ పెట్టుకున్నారు కూడ. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.

ఆతర్వాత కిశోర్ తిరుమల తన సినిమాల్లో బిజీ అయిపోయారు. ప్రజెంట్ ఆయన రామ్ హీరోగా ‘రెడ్’ అనే సినిమా చేస్తున్నారు. తాజాగా ఫిలిమ్ నగర్ టాక్ మేరకు ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ శర్వానంద్ వద్దకు వెళ్ళిందట. కిశోర్ తిరుమల కథను శర్వానంద్ కు తగ్గట్టు మార్పులు చేశారని, శర్వాకు కూడ నచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం శర్వానంద్ ‘శ్రీకారం’ అనే చిత్రం చేస్తున్నారు. వచ్చే నెలలో షూటింగ్ రీస్టార్ట్ కానుంది. అది పూర్తవగానే అజయ్ భూపతి డైరెక్షన్లో ‘మహాసముద్రం’ చేయాల్సి ఉంది. కాబట్టి కిశోర్ తిరుమల చిత్రం 2021లో మొదలవుతుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు