శర్వానంద్ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ తిరిగి మొదలైంది

శర్వానంద్ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ తిరిగి మొదలైంది

Published on Oct 1, 2020 9:50 PM IST


యువహీరో శర్వానంద్ వరుస సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. అయన మొదలుపెట్టిన చిత్రాల్లో ఒకటి ‘శ్రీకారం’ కాగా మరొకటి తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం. నూతన దర్శకుడు శ్రీకార్తిక్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. గతేడాది ఆగష్టు నెలలోనే మొదలైన ఈ సినిమా కొంత భాగం షూటింగ్ కూడ జరుపుకుంది. ప్లానింగ్ ప్రకారం జరిగి ఉంటే ఈ ఏడాది వేసవిలో విడుదల అనుకున్నారు. కానీ లాక్ డౌన్ కారణంగా ఆలస్యమైంది.

మిగిలి ఉన్న కొద్ది భాగం చిత్రీకరణను నిన్న రీస్టార్ట్ చేశారు. ప్రజెంట్ శూతినః చెన్నైలో జరుగుతోంది. ఈ సందర్బంగా శర్వా మాట్లాడుతూ ఇలా చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకు రావడం స్వచ్ఛమైన గాలిని పీల్చుకున్న అనుభూతిని ఇస్తోంది అంటూ హ్యాపీగా ఫీలయ్యారు. ఇందులో కథానాయికగా రీతు వర్మ నటిస్తుండగా అమల అక్కినేని, వెన్నెల కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై యస్‌.ఆర్‌. ప్రభు, యస్‌.ఆర్‌ ప్రకాశ్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇకపోతే శర్వానంద్ త్వరలోనే అజయ్ భూపతి డైరెక్షన్లో ‘మహాసముద్రం’ సినిమాను స్టార్ట్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు