బాలయ్య సరసన మళ్ళీ నటించబోతుంది !

బాలయ్య సరసన మళ్ళీ నటించబోతుంది !

Published on Feb 24, 2020 7:00 AM IST

నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికే ఒక హీరోయిన్ గా అంజలిని ఫైనల్ చేసింది టీం. అయితే తాజగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో శ్రియా సరన్ ను ఓ కీలక పాత్ర కోసం తీసుకోవాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రియా బాలయ్య సరసన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ అనే సినిమాలో కలిసి నటించింది.

కాగా ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమాలో బాలయ్య డిఫెరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే గుండుతో పాటు ఫుల్ మీసంతో ఉన్న ఫోటో బాగా వైరల్ అయ్యాయి. మొత్తానికి బాలయ్య జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు