‘విరాటపర్వం’ కోసం ప్రత్యేక ఏర్పాట్లు !

‘విరాటపర్వం’ కోసం ప్రత్యేక ఏర్పాట్లు !

Published on Jun 29, 2020 12:06 PM IST

రానా – సాయి పల్లవి కలిసి చేస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. దర్శకుడు ‘వేణు ఉడుగుల’ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం ఇప్పటికే 90% చిత్రకరణ పూర్తయింది. కాగా మేకర్స్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను ప్రారంభించారు. రామా నాయుడు స్టూడియోలో ఈ చిత్రం రీ రికార్డింగ్ కొనసాగుతోందని తాజా నివేదిక. అయితే తమ సెటప్‌ ను మ్యూజిక్ స్టూడియోకి మార్చలేనందున, మేకర్స్ రామానాయుడు స్టూడియోలోనే తాత్కాలిక మ్యూజిక్ స్టూడియోను ఏర్పాటు చేశారని ప్రస్తుతం మ్యూజిక్ పనులన్నీ పూర్తి స్థాయిలో అక్కడే జరుగుతున్నాయని తెలుస్తోంది.

కాగా తెలంగాణ ప్రాంతంలోని 1990 నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా పీరియాడిక్ సోషల్ డ్రామాగా ఈ మూవీ రానుంది. ఇక ఈ సినిమాను హిందీ, తమిళ భాష‌ల్లోనూ రిలీజ్ చేయనున్నారు. నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో సాగే ఈ సినిమాని డి. సురేష్‌బాబు, సుధాక‌ర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తోన్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ ఫేమ‌స్ న‌టి నందితా దాస్‌, ఈశ్వ‌రీరావు, జ‌రీనా వ‌హాబ్ ప్ర‌ధాన పాత్ర‌లు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు