‘సైరా నరసింహారెడ్డి’ రంగం సిద్ధం చేసుకుంటున్నాడు !

‘సైరా నరసింహారెడ్డి’ రంగం సిద్ధం చేసుకుంటున్నాడు !

Published on Aug 6, 2019 12:00 PM IST

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చెయ్యాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 15 మరియు 16 తేదీలలో జరగబోయే సైమా అవార్డ్స్ ఫంక్షన్ లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే అమితాబ్ బచ్చన్ మరియు చిరంజీవిల కాంబినేషన్ లో ఈ స్పెషల్ పోస్టర్ కూడా విడుదల కానుంది. కాగా సైరా టీమ్ భారీ ఎత్తున గొప్ప ప్రచార ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్‌ ను గ్రాండ్‌ గా విడుదల చేయడానికి చిత్రబృందం ప్రణాళికలను సిద్ధం చేసుకుంది.

ఇక ఈ చిత్రం ట్రైలర్ కోసం అభిమానాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది ఈ చిత్రం. ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు