కోర్ట్ అనే సినిమాతో యువ జంట శ్రీదేవి ఆపళ్ళ అలాగే హర్ష రోహన్ లు స్టార్స్ అయ్యారు. అయితే ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తర్వాత ఇద్దరి కలయికలో వచ్చిన లేటెస్ట్ రోమ్ కామ్ చిత్రం ‘బ్యాండ్ మేళం’ మాత్రం ఆ సినిమా రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది. గత మార్చ్ 26న థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది.
ఈ సినిమా తాలూకా స్ట్రీమింగ్ హక్కులని జీ 5 వారు సొంతం చేసుకోగా లేటెస్ట్ గా వారు స్ట్రీమింగ్ డేట్ ని ఇచ్చేసారు. ఈ ఏప్రిల్ 24 నుంచి బ్యాండ్ మేళం ఓటిటిలో సౌండ్ చేయనున్నట్టు ఖరారు చేశారు. సో ఈ సినిమాని అప్పుడు మిస్సయి ఓటిటిలో చూడాలి అనుకునేవారు చూడొచ్చు. ఇక ఈ సినిమాకి సతీష్ జవ్వాజి దర్శకత్వం వహించగా బేబీ సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. అలాగే కోనా వెంకట్ నిర్మాణం వహించారు.


