వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న శ్రీను వైట్ల !

వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న శ్రీను వైట్ల !

Published on Feb 20, 2019 2:30 PM IST

ఇటీవల వరుస పరాజయాలతో సతమతం అవుతున్న డైరెక్టర్ శ్రీను వైట్ల ఇప్పుడు వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక ఇప్పటికే దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యిందని సమాచారం. ఈ వెబ్ సిరీస్ కు ‘ఆనందం’ అనే టైటిల్ ను ఖరారు చేశారట. తర్వలోనే ఈ వెబ్ సిరీస్ కార్యరూపం దాల్చనుంది.

ఇక ఇటీవల అమర్ అక్బర్ ఆంటొని చిత్రం తో కెరీర్ లో మరో డిజాస్టర్ ను ఖాతాలో వేసుకున్న శ్రీను వైట్ల తన తదుపరి చిత్రాన్ని మంచు విష్ణు తో చేయనున్నాడని టాక్. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ఢీ’ కి సీక్వెల్ గా తెరకెక్కనుందట ఈ చిత్రం. విష్ణు సొంతం బ్యానేర్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ సినిమా గురించి తర్వలోనే అధికారిక ప్రకటన వెలుబడనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు