ఇంట్రస్టింగ్ బ్యాక్ డ్రాప్ లో మహేష్ 26 !

ఇంట్రస్టింగ్ బ్యాక్ డ్రాప్ లో మహేష్ 26 !

Published on Jan 23, 2019 2:44 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ చిత్రం మహర్షి లో నటిస్తున్నారు. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదలకానుంది. ఇక ఈ చిత్రం తరువాత మహేష్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం జూన్ నుండి ప్రారంభం కానుంది. ఇక ఈ చిత్రం చిత్తూరు జిలాల్లో జరుగుతున్న ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందని సమాచారం.

ఇక ఇటీవల విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రంగస్థలం చిత్రాన్ని తెరకెక్కించి బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని అందుకొన్న సుకుమార్ మరి ఈ చిత్రాన్ని ఏవిందంగా తెరెకెక్కిస్తాడో చూడాలి. కాగా మహేష్ -సుకుమార్ కాంబినేషన్లో ఇది రెండో సినిమా. ఇంతకుముందు వీరిద్దరి కలయికలో వచ్చిన వన్ నేనొక్కడినే అంచనాలను అందుకోలేకపోయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు