మెగాస్టార్’లూసిఫర్’ రీమేక్ కోసం పాపులర్ నటి ?

మెగాస్టార్’లూసిఫర్’ రీమేక్ కోసం పాపులర్ నటి ?

Published on Sep 29, 2020 8:11 PM IST

మెహాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చేస్తున్న ఆయన తర్వాత మెహర్ రమేష్, వివి.వినాయక్ లాంటి దర్శకులతో సినిమాలు చేయనున్నారు. వాటిలో వినాయక్ చేయనున్నది మలయాళం ‘లూసిఫర్’ తెలుగు రీమేక్. మలయాళంలో సూపర్ హిట్టైన ఈ సినిమాను కొన్ని మార్పులతో తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు తయారుచేస్తున్నారు. ఇందులో చిరు సోదరి పాత్ర కోసం స్టార్ నటి రమ్యకృష్ణను తీసుకుంటున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్.

ఒరిజినల్ వెర్షన్లో మంజూ వారియర్ ఈ పాత్రను చేయడం జరిగింది. ఈ పాత్రకు కథలో మంచి ప్రాధాన్యం ఉంటుంది. అందుకే పెద్ద నటిని తీసుకోవాలని రమ్యకృష్ణను ఫైనల్ చేశారట. ‘బాహుబలి’ చిత్రంతో రమ్యకృష్ణ సూపర్ పాపులర్ అయ్యారు. ఆమె అయితే పాత్రకు అన్ని విధాలా న్యాయం జరుగుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారట మేకర్స్. గతంలో రమ్యకృష్ణ, చిరంజీవిలు కలిసి పలు సినిమాల్లో హీరో హీరోయిన్లుగా నటించారు. అలాంటివారు ఇప్పుడు అన్నా చెల్లెళ్ళలా నటించడం సినిమాకు ఒక ప్రత్యేకతను తీసుకురానుంది. ఇకపోతే ఈ సినిమాను మెహర్ రమేష్ చిత్రం పూర్తయ్యాక మొదలుపెడతారట చిరు. మొదట ఈ చిత్రానికి సుజిత్ కుమార్ దర్శకుడిగా అనుకున్నా తర్వాత వినాయక్ తెరమీదకు రావడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు