స్టార్ డైరెక్టర్ చేతుల మీదగా ముగ్గురు హీరోల మల్టీస్టారర్ ట్రైలర్ !

స్టార్ డైరెక్టర్ చేతుల మీదగా ముగ్గురు హీరోల మల్టీస్టారర్ ట్రైలర్ !

Published on Oct 15, 2018 8:59 AM IST

యువ హీరోలు నారా రోహిత్‌, శ్రీవిష్ణు, సుధీర్ బాబు, కలయికలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ ‘వీర భోగ వసంత రాయలు’ చిత్రం. నూతన దర్శకుడు ఇంద్రసేన ఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ శ్రీయ ముఖ్య పాత్రలో నటిస్తుండటం విశేషం. ఈ చిత్రం థియేటర్ ట్రైలర్ ని ఈ రోజు సాయంత్రం 6 గంటలకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ విడుదల చేయనున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వనుంది. అయితే ఈ చిత్రం యుఎస్ లో విడుదల తేదీ కంటే రెండు రోజుల ముందే అక్టోబరు 23న విడుదల అవ్వబోతుంది. ఫ్లైహై సినిమాస్ ఈ చిత్రాన్ని యుఎస్ లో రిలీజ్ చేస్తున్నారు.

కాగా వైవిధ్యమైన కథ కథనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎవరు ఊహించని విధంగా డిఫరెంట్ గా ఉంటుందట. ఈ ప్రయోగాత్మకమైన చిత్రం తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోందని తెలుస్తోంది. క్రైమ్ డ్రామాగా థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి మార్క్ కే రాబిన్ సంగీతం సమకూరుస్తుండగా, బాబా క్రియేష‌న్స్ ప‌తాకంపై, ఎంవికె రెడ్డి గారి సమర్పణలో అప్పారావు బెల్లాన నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు