యాంకర్ ఝాన్సీ హోస్ట్గా స్టార్ మాలో పరివార్ లీగ్, లీగ్-2 వచ్చిపోయిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు అంతకు మించి డబుల్ ఎంటర్టైన్ అందించేందుకు స్టార్ మా పరివార్ “ఛాంపియన్షిప్” రాబోతుంది. తాజాగా దీనికి సంబంధించి స్టార్ మా వారు ఓ ప్రోమోను రిలీజ్ చేశారు.
ఎంటర్టైన్మెంట్ అన్ లాక్ అంటూ స్టార్ట్ అయిన ఇందులో మొట్టమొదటి సారిగా 50కి పైగా టీవీ సెలబ్రెటీస్ ఒకే వేదికపైకి వచ్చారు. 18 అమేజింగ్ పర్ఫార్మెన్స్లు ఉన్నట్టు, త్వరలో సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవల్లో ఉండబోతున్నట్టు అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి సుమ కనకాల యాంకర్గా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది.