ఆకట్టుకుంటున్న ‘సుబ్రహ్మణ్యపురం’ ట్రైలర్ !

ఆకట్టుకుంటున్న ‘సుబ్రహ్మణ్యపురం’ ట్రైలర్ !

Published on Nov 21, 2018 7:45 PM IST


సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో హీరో సుమంత్ కథానాయకుడిగా రాబోతున్న తాజా చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. ఈ చిత్రంలో సుమంత్ సరసన ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తోంది. ‘సుబ్రహ్మణ్యపురం’ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ను ఈ రోజు రాత్రి 7 గంటలకు విడుదల చేసింది చిత్రబృందం.

కాగా ట్రైలర్ ఆసక్తికరంగా సాగుతూ ఆకట్టుకున్నే విధంగా ఉంది. ట్రైలర్ చూస్తుంటే.. సుమంత్ ఓ నాస్తికుడు అని, దేవాలయాల మీద పరిశోధన చేసే పాత్రలో సుమంత్ ఈ సినిమాలో కనిపించనున్నాడని.. అలాగే దేవుడికి ప్లస్ మూఢ నమ్మకాలకి.. వర్సెస్ నాస్తికుడు అయినా హీరోకి మధ్య, ఈ సినిమా ఉండబోతుందని అర్ధం అవుతుంది.

డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని భీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు