తక్కువ రన్ టైంతో రానున్న’సుబ్రహ్మణ్యపురం’ !

తక్కువ రన్ టైంతో రానున్న’సుబ్రహ్మణ్యపురం’ !

Published on Nov 24, 2018 5:09 PM IST

సీనియర్ హీరో సుమంత్ నటించిన 25వచిత్రం’ సుబ్రహ్మణ్యపురం’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకోంది. డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో రానున్న ఈచిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈచిత్రం 132 నిమిషాల 39సెకండ్ల నిడివి తో ప్రేక్షకులముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క ట్రైలర్ చిత్రం ఫై అంచనాలను పెంచింది.

సంతోష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈచిత్రంలో ఈశా రెబ్బ కథానాయికగా నటించగా శేఖర్ చంద్ర సంగీతం అందించారు. భీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈచిత్రం డిసెంబర్ 7న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు