టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నాగ శేకర్ తెరకెక్కిస్తున్న సినిమా గుర్తుందా శీతాకాలం. ఇందులో సుహాసిని కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆమె ఇటీవల షూటింగ్లో జాయినయ్యారు. ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్లుక్కి మంచి స్పందన లభించిందనీ, త్వరలో ట్రైలర్ విడుదల చేస్తామని దర్శక-నిర్మాతలు తెలిపారు.
ప్రతీ ఒక్కరు తమ జీవితంలో సెటిల్ అయిన తర్వాత కొన్ని విషయాల్ని ఎప్పటికీ మరిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వచ్చే యూత్ లైఫ్లో జరిగే సంఘటనలు జీవితాంతం గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఇలాంటి ఆహ్లాదకరమైన సంఘటణలు ప్రేక్షకులకి గుర్తు చేసే ఉద్దేశంతో నాగశేఖర్ మూవీస్ బ్యానర్ మీద నాగశేఖర్ – భావనరవి, ఎమ్ ఎస్ రెడ్డి, చినబాబు గారు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా గుర్తుందా శీతాకాలం.
ఇప్పటికే ఈ సినిమా టైటిల్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. టాలెంటెడ్ హీరో సత్యదేవ్, తమన్నా, మేఘా ఆకాష్, కావ్యశెట్టి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. దాంతో ఈ సినిమాపై ఆసక్తి కూడా బాగానే పెరిగిపోయింది. ఇండస్ట్రీలో వర్గాల్లోనూ ఈ సినిమా పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. కన్నడలో విడుదలై సూపర్ హిట్ అయిన లవ్ మాక్ టేల్ ఆధారంగా గుర్తుందా శీతాకాలం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.