సందీప్ కిషన్ హీరోగా జూలై 12న విడుదల కాబోతున్న చిత్రం `నిను వీడని నీడను నేనే`. ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన అన్య సింగ్ కథానాయికగా నటిస్తోంది. అయితే గత కొన్ని సినిమాలుగా సరైన హిట్ లేని సందీప్ కిషన్ కి ఈ సినిమా హిట్ అవ్వడం చాల కీలకం. మనిషి తన నీడతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే ఎలా వుంటుందో అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం సందీప్ కి హిట్ ఇస్తోందా.. సినిమాకైతే ఇప్పటివరకూ పెద్దగా బజ్ కూడా క్రియేట్ అవ్వలేదు.
కానీ ఎవరూ టచ్ చేయని డిఫరెంట్ పాయింట్ తో ఎమోషనల్ హారర్ ఎంటర్టైనర్ కథాంశంతో రానున్న ఈ సినిమా.. మరి ఆడియన్స్ ను ఎంతవరకూ ఆకట్టుకుంటుందో చూడాలి. దయా పన్నెం, వి.జి.సుబ్రహ్మణ్యన్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానుంది. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కార్తీక్ రాజు తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.