స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను, అభిమానులని అలరించడానికి సిద్దం అవుతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ బిగ్గీలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ని విడుదల చేశారు మేకర్స్. జై బాలయ్య అనే టైటిల్ తో రూపొందిన ఈ పాటలో థమన్ ఎస్. గుడి నేపథ్యంలో రూపొందించిన ఆకట్టుకునే ట్యూన్, మంచి విజువల్స్ ఉన్నాయి.
బాలయ్య ఎనర్జిటిక్ స్టెప్పులు, రాయల్ లుక్ తో ఈ పాటకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. రిలీజైన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పాటకి యూ ట్యూబ్ లో ఇప్పటి వరకూ 4 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఈ పాటకి అత్యుత్తమ సాహిత్యాన్ని రామజోగయ్య శాస్త్రి రచించారు. మరియు ఈ పాటను కరిముల్లా పాడారు. జై బాలయ్య తక్కువ సమయంలో ప్లేలిస్ట్ లను శాసిస్తున్నాడు. ఈ చిత్రంలో దునియా విజయ్ మరియు వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2023 సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.