బిగ్‌బాస్ ఎంట్రీపై సురేఖ వాణీ క్లారిటీ.. మరీ అలా ఎందుకు చేసింది?

బిగ్‌బాస్ ఎంట్రీపై సురేఖ వాణీ క్లారిటీ.. మరీ అలా ఎందుకు చేసింది?

Published on Aug 5, 2021 12:00 AM IST

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని ఎంతో మంది ప్రేక్షక అభిమానులను కూడగట్టుకుంది. అయితే త్వరలోనే బిగ్‌బాస్‌ ఐదో సీజన్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. సెట్‌ నిర్మాణం, కంటెస్టెంట్ల ఎంపిక పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకోవడంతో ఇటీవల ఐదో సీజన్‌ లోగోని కూడా విడుదల చేశారు. అయితే పరిస్థితులు కాస్త సర్ధుకుంటే సెప్టెంబర్ 5వ తేదిన ఈ షోను ప్రారంభించాలని నిర్వాహకులు భావిస్తున్నట్టు సమాచారం.

ఇదిలా ఉంటే ప్రతీ సీజన్ లాగానే ఈ సారి హౌస్‌లోకి వెళ్ళేది వీరే అంటూ ఓ జాబితా కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అందులో యాంకర్ రవి, యాంకర్ వర్షిణి, గెటప్ శ్రీను, రఘు మాస్టర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియా, సురేఖ వాణి, సీరియల్ యాక్ట్రెస్ నవ్య స్వామి, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్, ప్రేమకావాలి హీరోయిన్ ఈషా చావ్లా, యూట్యూబర్ సిరి హనుమంతు, లోబో, సింగర్ మంగ్లీ, టిక్ టాక్ స్టార్ దుర్గా రావు, సీరియల్ నటులు సిద్ధార్థ్ వర్మ-విష్ణు ప్రియ, టీవీ 9 ప్రత్యూష పేర్లు అందులో ఉన్నాయి.

అయితే తాజాగా బిగ్‌బాస్ ఎంట్రీపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణీ క్లారిటీ ఇచ్చేసింది. తాను బిగ్‌బాస్‌ షోకి వెళ్లడం లేదని, దయ చేసి ఇలాంటి రూమర్స్‌ని ఎంకరేజ్ చేయకండని ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. అయితే సురేఖ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లడం లేదని జనాలు ఓ క్లారిటీలోకి వచ్చేలోపే సురేఖ వాణి ఆ పోస్ట్‌ని కొద్ది క్షణాల్లోనే డిలీట్‌ చేసి ట్విస్ట్‌ ఇచ్చింది. దీంతో అసలు సురేఖ హౌస్‌లోకి వెళుతుందా? లేదా? హౌస్‌లోకి వెళ్లకపోతే ఎందుకు ట్వీట్ డిలీజ్ చేసింది? అని చాలా మంది మళ్లీ డైలామాలో పడిపోయారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు