త్రివిక్రమ్ ఓటు మళ్లీ ఆమెకేనా ?

త్రివిక్రమ్ ఓటు మళ్లీ ఆమెకేనా ?

Published on Feb 21, 2020 12:00 PM IST

వరుసగా ‘అరవింద సమేత, అల వైకుంఠపురములో’ వంటి హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు త్రివిక్రమ్ తన తర్వాతి చిత్రాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం తన గత రెండు సినిమాల మాదిరే భిన్నమైన నేపథ్యం ఎంచుకున్నారట. ఇక కథానాయికగా తన గత రెండు సినిమాల్లో నటించిన పూజా హెగ్డేను తీసుకోవాలనే యోచనలో ఉన్నారట త్రివిక్రమ్.

ఎందుకంటే ‘అరవింద సమేత’లో ఎన్టీఆర్, పూజా హెగ్డేల జోడీ చాలా బాగా కుదిరింది. ప్రేక్షకులకు వారి జంట బాగా నచ్చింది. అందుకే మళ్లీ ఆమెనే రిపీట్ చేయాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారని టాక్. మరి పూజా హెగ్డే ఫైనల్ అవుతుందో లేదో తెలియాలంటే కొంత వెయిట్ చేయాల్సిందే. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. వచ్చే యేడాది వేసవి కానుకగా ఈ చిత్రం విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు