కొద్దిసేపటి క్రితం స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న, సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త చిత్రం గుంటూరు కారం యొక్క ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. ఇది ప్రేక్షకుల నుండి అందరి అభిమానాన్ని పొందుతోంది. మ్యూజికల్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. గుంటూరు కారం ఆల్బమ్ సూపర్ మాస్ గా ఉంటుందని థమన్ ఇప్పుడు మహేష్ బాబు అభిమానులందరికీ హామీ ఇచ్చాడు.
థమన్ గతంలో సూపర్స్టార్కి చాలా సూపర్హిట్ ఆల్బమ్లను అందించాడు. గుంటూరు కారం కూడా సూపర్ హిట్ ఆల్బమ్ అవుతుంది అని అభిమానులు భావిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. గుంటూరు కారం 2024 సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి రానుంది.
