డబ్బుకంటే స్క్రిప్టుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానంటున్న మహానటి !

డబ్బుకంటే స్క్రిప్టుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానంటున్న మహానటి !

Published on Jul 17, 2018 7:43 PM IST

నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘మహానటి’ చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అద్భుతంగా నటించి విమర్శకులను సైతం తన నటనతో మెప్పించింది. సావిత్రిగా ఆమె తప్ప ఇంకెవ్వరూ ఆ పాత్రకు న్యాయం చేయలేరేమో అనేంతగా ఆ చిత్రంలో కీర్తి నటన ఉంది.

కాగా మహానటి చిత్రంతో కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్‌ గా మారిపోయింది. దాంతో ఆమె తన పారితోషకాన్ని భారీగా పెంచిందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ ఆ వార్తలను ఖండించింది. తాను నటన మీద మక్కువతో ఎంతో ఫ్యాషన్ తో సినిమా ఇండస్ట్రీకి వచ్చానని, కేవలం డబ్బు కోసం కాదని తెలిపింది. తానెప్పుడూ మంచి కథకు, పెర్ఫార్మెన్స్‌ కి ప్రాధాన్యం ఇస్తాను తప్ప, పారితోషకానికి కాదని కీర్తి సురేష్ వెల్లడించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు