థ్రిల్లింగ్ విజయంతో కలెక్షన్స్ రాబడుతున్న “తెప్పసముద్రం”

థ్రిల్లింగ్ విజయంతో కలెక్షన్స్ రాబడుతున్న “తెప్పసముద్రం”

Published on Apr 22, 2024 9:04 AM IST

బిగ్ బాస్ ఫేం అర్జున్ అంబటి హీరోగా, కిశోరి దాత్రక్ హీరోయిన్‌గా రవిశంకర్, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం తెప్ప సముద్రం. సతీష్ రాపోలు దర్శకత్వంలో బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి పి. ఆర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన ఈచిత్రం అన్ని కేంద్రాల్లో దిగ్విజయంగా ప్రదర్శించ బడుతోంది. వాస్తవ సంఘటనలతో, అనేక మలుపులతో ప్రేక్షకులకు థ్రిల్ కలిగించిన ఈ చిత్రం, క్రిటిక్స్ ను సైతం మెప్పించింది. ఈ చిత్రం విడుదలయిన మూడు రోజుల్లో రూ.2.25 కోట్లను వసూలు చేసి, బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ రాబట్టిందని నిర్మాత నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ తెలిపారు.

ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇందులో లీడ్ రోల్ పోషించిన అర్జున్ అంబటి, హిరోయిన్ కిషోర్ దాత్రిక్, చైతన్య రావుల నటనను ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే లాయర్ విశ్వనాథ్ పాత్రలో రవిశంకర్ పోషించిన పాత్ర సినిమాకే హైలైట్ గా నిలిచిందని తెలిపారు. కొన్ని వాస్తవ ఘటనలను బేస్ చేసుకుని సస్పెన్స్ థ్రిల్లర్ గా మలిచిన ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దర్శకుడు సతీష్ రాపోలు ఎంచుకున్న కథ కథనాలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు