ప్రియాంక చిత్రానికి దక్కిన అరుదైన గౌరవం.

ప్రియాంక చిత్రానికి దక్కిన అరుదైన గౌరవం.

Published on Jul 24, 2019 7:39 PM IST

నటి ప్రియాంక చోప్రా, ఫర్హాన్ అక్తర్, దంగల్ ఫేమ్ జైరా వసీం ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం “ది స్కై ఈజ్ పింక్”. ప్రాణాంతకమైన వ్యాధిబారిన పడిన యంగ్ డాటర్, అతని తల్లిదండ్రుల మధ్య యదార్ధంగా జరిగిన సంఘటనల ఆధారంగా దర్శకుడు షోనాలి బోస్ రూపొందిస్తున్నారు. ఆర్ ఎస్ వి పి ప్రొడక్షన్స్, రాయ్ కపూర్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్11న విడుదల కానుంది.

కాగా “ది స్కై ఈజ్ పింక్” చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో ఓ అరుదైన గౌరవం దక్కింది. ఈ చిత్రం సెప్టెంబర్ 5నుండి 15వరకు కెనడా దేశంలోని టొరంటో వేదికగా జరగనున్న అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు. మరో విశేషం ఏమిటంటే ఈ ఏడాదికి గాను మొత్తం ఆసియా నుండి ఈ అర్హత సాధించిన ఏకైక చిత్రం “ది స్కై ఈజ్ పింక్” కావడం గమనార్హం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు