సందీప్ కిషన్ హీరోగా అన్య సింగ్ హీరోయిన్ గా రాబోతున్న ‘నిను వీడని నీడను నేనే’ చిత్రం ఈ నెల 12న విడుడల కానుంది. కార్తీక్ రాజు దర్శకుడు. కాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న హీరో నిఖిల్ మాట్లాడుతూ.. షూటింగ్ లో ఉండగా ఈ సినిమా గురించి తెలిసి నేనూ నిర్మాతగా జాయిన్ అవుతానని సందీప్ ని అడిగాను. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. సందీప్ కి కంగ్రాట్స్ ‘ అన్నారు.
వెంకటాద్రి టాకీస్ వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాల పై ఈ సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్ నిర్మాతలు. మరి గత కొన్ని సినిమాలుగా సరైన హిట్ లేక బాక్సాఫీస్ వద్ద వెనుకపడిపోయిన సందీప్ కిషన్ కెరీర్ కి ఈ చిత్రం హిట్ అవడం అత్యవసరవం. కాగా ‘నిను వీడని నీడను నేనే’ సందీప్ కి హిట్ ఇస్తోందో లేదో చూడాలి.