సురేంధర్ రెడ్డి ప్రభాస్ ని కావాలనుకుంటుంది అందుకేనా?

సురేంధర్ రెడ్డి ప్రభాస్ ని కావాలనుకుంటుంది అందుకేనా?

Published on Nov 17, 2019 10:54 AM IST

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన సురేంధర్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి తో సైరా లాంటి పాన్ ఇండియా మూవీ తీశారు. సైరా తెలుగులో నాన్ బాహుబలి రికార్డ్స్ సొంతం చేసుకుంది. మరి సురేంధర్ రెడ్డి తర్వాత చిత్రం ఎవరితో చేయనున్నారు అనే విషయంపై అనేక ఊహాగానాలు నడుస్తున్నాయి. ఆయనైతే స్క్రిప్ట్ సిద్ధం చేసి రెడీగా ఉన్నట్లు సమాచారం. సురేంధర్ రెడ్డి వెంటనే మూవీ స్టార్ చేయాలంటే టాలీవుడ్ కుర్ర హీరోలలో ఒకరిద్దరు సిద్ధంగా ఉన్నారు.

స్టార్ హీరోతో చేయాలంటే కొంత కాలం ఆగాల్సిందే. మహేష్, బన్నీ కొద్దిరోజులలో తమ సంక్రాంతి చిత్రాల షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఐతే బన్నీ నెక్స్ట్ సుకుమార్ తో కమిటైపోగా, మహేష్ మళ్ళీ వంశీ పైడిపల్లితో మూవీ చేయాలని చూస్తున్నారని సమాచారం. ఇక ఎన్టీఆర్, చరణ్ ఆర్ ఆర్ ఆర్ నుండి ఎప్పుడు బయటపడతారో చెప్పలేం. చివరికి కిక్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన రవితేజ కూడా గోపీచంద్ మలినేని చిత్రాన్ని మొదలుపెట్టారు.

కాబట్టి ప్రభాస్ ఐతేనే తాను త్వరగా మూవీ మొదలుపెట్టే అవకాశం కలదని ఈ దర్శకుడు భావిస్తున్నారట. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న జాన్ మూవీ ఇప్పటికే 20-30 శాతం షూటింగ్ పూర్తయింది. వచ్చే వేసవి చివరికల్లా ప్రభాస్ ఈ మూవీని పూర్తి చేసే అవకాశం కలదు. ఎటూ ఇకపై ప్రభాస్ వేగంగా చిత్రాలు చేయాలని భావిస్తున్నారు కాబట్టి సురేంధర్ రెడ్డి స్క్రిప్ట్ కనుక నచ్చితే వెంటనే ఓకే చెప్పే అవకాశం కలదు. అందుకే సురేంధర్ రెడ్డి… ప్రభాస్ ని మెప్పించే పనిలో ఉన్నారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు