విజయంపై ఆశాభావం వ్యక్తం చేసిన ‘తోలు బొమ్మలాట’ టీమ్.

విజయంపై ఆశాభావం వ్యక్తం చేసిన ‘తోలు బొమ్మలాట’ టీమ్.

Published on Nov 19, 2019 5:13 PM IST

విశ్వంత్‌ దుద్దుంపూడి, హర్షిత చౌదరి హీరోహీరోయిన్లుగా రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం “తోలు బొమ్మలాట”. సుమదుర్గా క్రియేషన్స్ పతాకంపై ఐశ్వర్య మాగంటి సమర్పణలో దుర్గాప్రసాద్‌ మాగంటి ఈ చిత్రాన్ని నిర్మించారు . విశ్వనాథ్‌ మాగంటి దర్శకునిగా పరిచయమవుతున్నారు.ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని సోమవారం రాత్రి హైదరాబాద్ లో చిత్ర యూనిట్ గ్రాండ్ గా నిర్వహించింది. వేడుకలో రాజేంద్రప్రసాద్, విశ్వంత్, హర్షిత, నారాయణరావు, జానకి, కల్పన, దేవి ప్రసాద్, నర్రా శ్రీనివాసరావు, సురేష్ బొబ్బిలి, చైతన్య ప్రసాద్, సతీష్, అజయ్ మోహన్ , రమేష్, నవీన్ , ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ ,మాధవ్ తదితరులు పాల్గొన్నారు. బిగ్ సీడీ ని డా . రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ ని స్వర్ణ కంకణంతో సత్కరించారు నిర్మాత దుర్గా ప్రసాద్ మాగంటి. హర్షిత, నారాయణరావు, జానకి, కల్పన, దేవి ప్రసాద్, నర్రా శ్రీనివాసరావు, సురేష్ బొబ్బిలి, చైతన్య ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్ర విజయం పై యూనిట్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.వెన్నెల కిశోర్‌, దేవీ ప్రసాద్‌, నర్రా శ్రీనివాస్‌ తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు