‘టైగర్ నాగేశ్వర్ రావు’ జూలైలో స్టార్ట్ అవుతాడట !

‘టైగర్ నాగేశ్వర్ రావు’ జూలైలో స్టార్ట్ అవుతాడట !

Published on May 19, 2019 12:03 AM IST

దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ చిత్రాల దర్శకుడు వంశీకృష్ణ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వర్ రావు’ బయోపిక్ ను నిర్మించాలని నిర్ణయించుకుని ఇప్పటికే రెండు సంవత్సరాలు అయిపొయింది. కానీ ఇప్పటికీ కూడా ఆ బయోపిక్ మాత్రం మొదలవ్వలేదు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రానున్న ఈ బయోపిక్ త్వరలో మొదలుకాబోతుందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం జూలై నుండి షూట్ మొదలుకానుందట.

ఇదిలా ఉండగా ఈ బయోపిక్ లో సెన్సేషన్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ను హీరోయిన్ గా తీసుకున్నారని సమాచారం. ఇంతకీ ఎవరు ఈ ‘టైగర్ నాగేశ్వర్రావు’ అని అనుకుంటున్నారా.. ? ఇప్పటి తరానికి ఆయన పెద్దగా తెలియకపోవచ్చు గాని, 1980-90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా టైగర్ నాగేశ్వర్ రావు ఒక భయానక వాతావరణాన్నే సృష్టించారు. మరి అలాంటి ఆయన బయోపిక్ అంటే ఇంట్రస్టింగ్ గా ఉంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు