‘టిల్లు స్క్వేర్’ వంద కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుంది – నిర్మాత నాగవంశీ

‘టిల్లు స్క్వేర్’ వంద కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుంది – నిర్మాత నాగవంశీ

Published on Mar 29, 2024 6:00 PM IST

యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ టిల్లు స్క్వేర్. ఈ మూవీని మల్లిక్ రామ్ తెరకెక్కించగా నాగవంశీ, సాయి సౌజన్య భారీ స్థాయిలో నిర్మించారు. ఇక నేడు మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ సక్సెస్ టాక్ ని దక్కించుకుంది. ఈ సందర్భంగా కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు మూవీ టీమ్.

నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, ఫస్ట్ షో నుండే టిల్లు స్క్వేర్ కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉందని అన్నారు. అలానే తమ అంచనాల ప్రకారం ఫస్ట్ డే రూ. 25 కోట్ల గ్రాస్ ని అలానే టోటల్ గా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ ఈ మూవీ సొంతం చేసుకుంటుందనే ఆశాభావం ఆయన వ్యక్తం చేసారు. అచ్చు రాజమణి, రామ్ మిరియాల సంగీతం అందించిన ఈ మూవీకి సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు ఫోటోగ్రఫి అందించారు. మరి రాబోయే రోజుల్లో టిల్లు స్క్వేర్ ఏస్థాయి కలెక్షన్ తో కొనసాగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు